గుమ్మడం మీదగా యాపర్ల కు బస్సు సౌకర్యం పునరుద్ధరించాలి* *యూత్ కాంగ్రెస్*

పెబ్బేరు జనం సాక్షి న్యూస్: పెబ్బేరు మండల కేంద్రం నుండి గుమ్మడం మీదగా యాపర్ల కు  వనపర్తి డిపో మేనేజర్ కు  అందచేసిన యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనరెడ్డి మరియుజిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శంకర్ ప్రసాద్ వినతిపత్రాన్ని అందజేశారు.వనపర్తి నియోజకవర్గం  పెబ్బేరు  మండల పరిధిలోని యాపర్ల, గుమ్మడం గ్రామాలకు గత కొంత కాలంగా బస్సు సౌకర్యం నిలిపివేశారని,నిన్న పెబ్బేరు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజ్ కుమారు అధ్యక్షతన యాపర్ల గ్రామంలో నిర్వహించిన కాంగ్రెస్ రైతు రచ్చబండ కార్యక్రమానికి రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కాగ  గ్రామప్రజలు ఆయన దృష్టికి ఈ ప్రధాన సమస్యను తీసుకురాగా అక్కడికక్కడే వనపర్తి బస్ డిపో మేనేజర్ తో ఫోన్ లో  మాట్లాడి సమస్యను వివరించి, మంగళవారం స్వయంగా వెళ్లి డిపో మేనేజర్ కు డీసీసీ అధ్యక్షుడు శంకర్ ప్రసాద్ తో వెళ్లి వినతిపత్రాన్ని సమర్పించి. సమస్యను ఒకటి రెండు రోజుల్లో పరిష్కరించలని కోరారు.ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ విష్ణు వర్ధన్ రెడ్డి,వర్కింగ్ ప్రెసిడెంట్ పాండు సాగర్,పెబ్బేరు మండల యూత్ అధ్యక్షుడు రాజ్ కుమార్,రమేష్ శ్రీను తదితరులు పాల్గొన్నరు