గొల్లపల్లి లో జాతీయ సమైక్యత వేడుకలు.

: జెండా ఆవిష్కరిస్తున్న సర్పంచ్.
నెన్నెల, సెప్టెంబర్17,(జనంసాక్షి)
మండలంలోని గొల్లపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో శనివారం తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను పురస్కరించుకుని సర్పంచ్ ఇందూరి శశికళ జాతీయజెండా ఆవిష్కరించారు.ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ నిజాం నవాబు నిరంకుశ పాలనకు చరమగీతం పాడి నేటి 74 పూర్తయి 75వ సంవత్సరంలోకి అడుగిడుతున్న సందర్భంగా జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను నిర్వహించుకున్నట్లు ఆమె తెలిపారు. ఈకార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రంజిత్, సింగిల్ విండో మాజీ ఛైర్మన్ ఇందూరి రమేష్, ఉప సర్పంచ్ జాడి నారాయణ, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.