గోడ కూలిన ప్రాంతాన్ని సందర్శించిన ప్రదీప్ రావు

వరంగల్ ఈస్ట్, జూన్ 11(జనం సాక్షి);
 వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని 25 వ డివిజన్ చార్ బౌళి లో భవన నిర్మాణ కూలి పని కోసం వచ్చి ప్రమాదవశాత్తు శనివారం గోడ  కూలడంతో కూలీలు మృతిచెందిన విషయం తెలుసుకున్న   తెరాస రాష్ట్ర నాయకులు  ఎర్రబెల్లి ప్రదీప్ రావు మరియు రాజనాల శ్రీహరి    సంఘటన స్థలానికి చేరుకుని  అక్కడి పరిస్థితిని పరిశీలించారు సహాయక చర్యలను పరిశీలించి మృతదేహాలకు నివాళి అర్పించారు. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటానని అన్నారు. ప్రభుత్వ పరంగా మృతుల కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొల్లూరి యోగానంద తదితరులు ఉన్నారు.