గోదావరి తీరాన్ని పరిశీలించిన డీఎల్పీవో , ఎంపీడీవో

ఇబ్రహీంపట్నం , సెప్టెంబర్ 12 ,(జనం సాక్షి ) మూడు రోజుల నుండి ఎడతెరుపు లేకుండా కురుస్తున్న భారి వర్షాలకు గోదావరికి వరద నీరు పోటెత్తింది.దీనికి తోడు శ్రీరామ సాగర్ ప్రాజెక్ట్ నుండి భారీగా నీటిని వదలడంతో , గోదావరి ప్రవాహాన్ని పరిశీలించడానికి డీఎల్పివో , శ్రీనివాస్ , ఎంపిడీవో ప్రభు పరిశీలించారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ వర్షాలకు గోదావరి ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గోదావరి వైపు చేపలు పట్టేందుకు ఎవరు వెళ్లరాదని సూచించారు. వారితో పాటు సర్పంచ్ కల్లెడ లక్షణ గంగాధర్, కార్యదర్శి మనోజ్ , వార్డుమెంబర్ రాజారెడ్డి,జిపి సిబ్బంది రతన్ తదితరులు పాల్గొన్నారు.