గోవా బీచ్లో ఘోరం…
బాయ్ఫ్రెండ్ ముందే గ్యాంగ్రేప్
– 24గంటల్లోనే నిందితులను పట్టుకున్న పోలీసులు
పనాజీ, మే26(జనం సాక్షి) : గోవా బీచ్లో శుక్రవారం సాయంత్రం దారుణ సంఘటన చోటుచేసుకుంది. టూరింగ్ కోసం వచ్చిన ముగ్గురు మానవ మృగాలు 20 ఏళ్ల యువతిపై గ్యాంగ్రేప్కి పాల్పడ్డారు. ఆమె స్నేహితుడి ముందే దారుణానికి ఒడిగట్టి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు 24 గంటల్లోగానే నిందితులను వలపన్ని పట్టుకున్నారు. దక్షిణ గోవా కోల్వా బీచ్ను సందర్శించేందుకు సవిూప గ్రామానికి చెందిన బాధిత యువతి తన స్నేహితుడితో కలిసి వెళ్లింది. అదే సమయంలో ఇండోర్కి చెందిన ముగ్గురు వ్యక్తులు అక్కడికి చేరుకున్నారు. యువజంట వారికంట పడడంతో వారిని బెదిరించి బలవంతంగా దుస్తులు తొలగించారు. ఇద్దర్నీ నగ్నంగా ఫోటోలు తీసి, డబ్బులు గుంజుకుని, యువతిపై ఆమె స్నేహితుడి ముందే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులకు చెబితే ఇద్దరి ఫోటోలు బయటపెడతామని బెదిరించి అక్కడినుంచి పారిపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఇప్పటికే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టామని దక్షిణ గోవా ఎస్పీ అర్వింద్ గవాస్ పేర్కొన్నారు. వైద్యపరీక్షల్లో యువతిపై అత్యాచారం జరిగినట్టు నిర్ధారణ కావడంతో.. నిందితులపై ఐపీసీ సెక్షన్ 376 అత్యాచారం), సెక్షన్ (దోపిడీ) సహా పలు సెక్షన్లపై కేసు నమోదు చేశారు.