గోవింద క్షేత్ర ఆలయ ధ్వజస్తంభానికి ఇత్తడి తొడుగు అందజేత.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్21(జనంసాక్షి):

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం హౌసింగ్ బోర్డ్ లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి గోవింద క్షేత్ర దేవాలయానికి ధ్వజస్తంభమునకు లక్ష 50వేల విలువగల ఇత్తడి తొడగును హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన సల్వాది, వార్ల నారాయణ,విజయమ్మ కుటుంబ సభ్యులు గురువారం నాడు అందజేశారని ఆలయ ప్రధాన అర్చకులు శ్రీదరిపల్లి విష్ణువర్ధనా ఆచార్యులు తెలిపారు.ఆయన మాట్లాడుతూ భక్తుల దాతృత్వంతో స్వామివారిని సేవించడం ఎంతో పుణ్యఫలం అని, నిత్యం భక్తులకు అందుబాటులో ఉండే ధ్వజస్తంభానికి ఇత్తడి తొడుగు మరియు పూజా కార్యక్రమాలు,వివిధ క్రతువులు నిర్వహించడం వారి కుటుంబ సభ్యులకు వెంకటేశ్వర స్వామివారి కృపాకటాక్షాలు ఉంటాయని ఆయన అన్నారు, ఆలయ నిర్మాణానికి గతంలో సల్వాది నారాయణ కుటుంబ సభ్యులు లక్ష 16వెలు అందజేసినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ తీగల సునేంద్ర, మేడముని దామోదర్, మలిశెట్టి నరసింహ, కుటుంబ సభ్యులు వార్ల బాలరాజ్, వి.ఆనంద్, వి.రమేష్, వి.అశోక్ కుమార్, చిన్నారులు,మహిళలు, తదితరులు పాల్గొన్నారు.