గ్రంథాలయానికి గ్రూప్స్, పోలీస్ స్టడీ మెటీరియల్ బహుకరణ

మోత్కూరు జూలై 26 జనంసాక్షి : కడియం సోమక్క మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేస్తున్న సామాజిక సేవాకార్యక్రల్లో భాగంగా పోటీ పరీక్షలకు సిద్ధపడే అభ్యర్థుల కోసం పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై,గ్రూప్ 4, గ్రూప్ 2 స్టడీ మెటీరియల్ ని నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న గ్రంథాలయాలకు ఉచితంగా అందజేస్తున్నట్టు ట్రస్ట్ ఫౌండర్ కడియం రాంచంద్రయ్య తెలిపారు. మంగళవారం మోత్కూర్ శాఖా గ్రంథాలయానికి 2 సెట్స్ స్టడీ మెటీరియల్స్ ని బహుకరించారు. ఈ సందర్భంగా రామ్ చంద్రయ్య మాట్లాడుతూ ట్రస్ట్ చైర్మన్ కడియం కళ్యాణ్ చందర్ రావు ఆధ్వర్యంలో భవిష్యత్తు లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయనున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న ఉద్యోగాల భర్తీలో ప్రతీ ఒక్కరూ విజయం సాధించాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా రామ్ చంద్రయ్యకు గ్రంథాలయ చైర్మన్ కోమటి మత్స్యగిరి, వైస్ ఛైర్మన్ పొలినేని స్వామి రాయుడు, గ్రంథాలయం ఇంచార్జ్ చిలకమర్రి బాబు చారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రైల్వే బోర్డ్ మెంబర్ కొనతం నాగార్జున రెడ్డి, బీజేపీ మున్సిపల్ అధ్యక్షుడు బయ్యని రాజు,సజ్జనం మనోహర్,నిలిగొండ సైదులు, చోల్లేటి నరేష్,మల్లేష్, నారాయణ,పాఠకులు సోమేశ్, ఆనందం,సి.హెచ్ బిక్షం,రాములు తదితరులు పాల్గొన్నారు.
 
Attachments area