గ్రామాలలో రెపరెపలాడుతున్న త్రివర్ణ పతాకం

ఇటిక్యాల (జనంసాక్షి) ఆగస్టు 13 : మండల కేంద్రంతో పాటు కొండేరు, ఎర్రవల్లి చౌరస్తా, ఆర్. గార్లపాడు, కారుపాకుల, సాసనూలు, బి. వీరాపురం, జింకలపల్లి, కోదండపురం, పుటాన్ దొడ్డి తదితర గ్రామాలలో సర్పంచులు గ్రామస్తులకు త్రివర్ణ పతాకాలను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామాలలోని ప్రజలు తమ గృహాలపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి దేశభక్తిని చాటుకుంటున్నారు. 75వ వజ్రోత్సవాలు పురస్కరించుకొని వ్యాపారస్తులు, ప్రజలు అధికారుల నిర్వహిస్తున్న ఫ్రీడమ్ ర్యాలీలలో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు.