గ్రామాల్లో జోరుగా ఆరు గ్యారెంటీల ప్రచారం

కాంగ్రెస్స్ అధికారంలోకి రాగానే హామీలు అమలు

మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గాలి దుర్గారావు

బోనకల్ ,అక్టోబర్ 31 (జనం సాక్షి): కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలను వంద రోజుల్లోనే అమలు చేస్తామని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాలి దుర్గారావు అన్నారు.మంగళవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దుర్గారావు మాట్లాడుతూ మధిర నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్కను నియోజకవర్గ ప్రజలు గత మూడు పర్యాయాలు ఆదరించి,భారీ మెజార్టీని అందించారు.అలాగే మళ్ళీ నియోజకవర్గం అభివృద్ది చెందాలంటే దమ్మున్న నాయకుడు భట్టి విక్రమార్క నీ నాలుగోసారి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.ఇప్పటికే గ్రామాల్లో ఆయా గ్రామ శాఖల ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రచార శైలిని క్లస్టర్ ఇంచార్జీలతో సమీక్షించారు.ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలను గ్రామాల్లో 90% మేర ప్రజలకు నాయకులు వివరిస్తూ పథకాల యొక్క ఆవశ్యకతను ప్రజలకు తెలియజేస్తున్నారాన్నరు.మధిర నియోజకవర్గం రూపురేఖలు మార్చడంలో భట్టి కృషి ఎంతో ఉందని అన్నారు.రానున్న రోజుల్లో మధిర నియోజకవర్గం రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉండబోతుందని అందుకు ప్రతీ కార్యకర్త కంకణం కట్టుకొని పార్టీ కోసం పని చేయాలనీ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జిలు మోదుగు సుధీర్ బాబు,కర్నాటి రామ కోటేశ్వరరావు,ఏర్రంశెట్టి సుబ్బారావు,చేబ్రోలు వెంకటేశ్వర్లు,పిల్లలమర్రి నాగేశ్వరరావు,శాస్త్రీ,కందుల పాపారావు తదితరులు ఉన్నారు.