గ్రామాల అభివృద్ధి బిఆర్ఎస్ పార్టీ తోనే సాధ్యం..

అభివృద్ధిని చూసి బిఆర్ఎస్ కు పట్టం కట్టండి..
ఔర్ ఏక్ దక్క పైలెట్ రోహిత్ రెడ్డి పక్కా..
జడ్పిటిసి ప్రమోదిని రెడ్డి. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్త్య విఠల్ నాయక్..
తాండూరు నవంబర్13(జనంసాక్షి)గ్రామాల అభివృద్ధి బిఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమైందని జెడ్పిటిసి ప్రమోదిని రెడ్డి. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్య్త విటల్ నాయక్ పేర్కొన్నారు. సోమవారం యాలాల మండలం కమల్ పూర్ గ్రామంలో సుమారు 50 మంది యువకులు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జెడ్పిటిసి ప్రమోదిని రెడ్డి పార్టీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు. అనంతరం గ్రామాలలో గడపగడపకు తిరుగుతూ బిఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్తూ అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా జడ్పిటిసి ప్రమోదిని రెడ్డి. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్త్య విఠల్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం హయాంలోనే అన్ని గ్రామాలలో అభివృద్ధి పరుగులు పెడుతుందని తెలిపారు. గ్రామాల అభివృద్ధి కేవలం బిఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమైందని వెల్లడించారు. బిఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. బిఆర్ఎస్ పార్టీ అభివృద్ధిని చూసి మరోసారి పట్టం కట్టాలని విజ్ఞప్తి చేశారు. మీ బిడ్డగా పైలట్ రోహిత్ రెడ్డిని మరోసారి ఆశీర్వదించాలని కోరారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మహిళ నాయకురాలు శకుంతల, యాలల మండల నాయకులు కార్యకర్తలు ఆయా గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.