గ్రామ పంచాయతీ సిబ్బంది వేతనాలు పెంపుపి.ఆర్.సి తరహా నిర్మాణాత్మక ఉద్యోగ అమలు చేయాలి

 మల్దకల్ సెప్టెంబర్ 20 (జనంసాక్షి) తెలంగాణ రాష్ట్రంలో 12765 గ్రామపంచాయతీలు సుమారు 36 వేల మంది  పారిశుద్ధ్య సిబ్బంది వాటర్ వీధి దీపాల నిర్వహణల కోసం పన్నులు వసూలు చేయడం ఆఫీస్ నిర్వాహన తదితరుల పనులలో వివిధ కేటగిరిలో కింది సిబ్బంది పనిచేస్తున్నారు. ప్రభుత్వం 2019 జీవో నెంబర్ 51 విడుదల చేసి వేతనాలు 8500 నిర్ణయించి అమలు చేయాలని మంగళవారము మల్దకల్ మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద ఎంపీడీవో కి వినతిపత్రం అందజేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతి 500 మంది జనాభాకు ఒక కార్మికుడు చొప్పున నియమించాలి,పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ పార్ట్ టైం ఫుల్ టైం సిబ్బందితో పాటు స్కీం వర్కర్ల రాష్ట్ర ప్రభుత్వం  కాంటిజెంట్ సిబ్బందితో పాటు స్కీం వర్కర్ల రాష్ట్ర ప్రభుత్వం 30% పిఆర్సి అమలు చేసి వేతనాలు పెంచింది. గ్రామపంచాయతీలో పనిచేస్తున్న కార్మికులను కేటాగిరులుగా గుర్తించి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 18,500 వేతనం పెంచి ఇవ్వాలి పనిచేస్తున్న కార్మికులందరికీ పర్మనెంట్ చేయాలి,మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేసి 2021 జనాభా ప్రతిపాదన కార్మికుల సంఖ్యను పెంచి కాళీ పోస్టులు భర్తీ చేయాలి,పీఎఫ్ పీఎఫ్ అమలు చేయాలి,ముఖ్యమంత్రి గతంలో ప్రకటించిన ఎస్కడే పేరిట రెండు లక్షలు ఇన్సూరెన్స్ ప్రభుత్వం విధినిర్వహణలో ప్రమాదంలో మరణించిన సిబ్బంది కుటుంబాలకు 10 లక్షల నష్టపరిహారం ప్రభుత్వం ఇవ్వాలి,వయసు మీరుందని సాకుతో కార్మికులను మార్చుట కుటుంబంలో ఒకరి ఉద్యోగ భద్రత ఇవ్వాలి,కార్మికులు మరణిస్తే దాహన సంస్కరణకు 50 వేలు ఇవ్వాలి,
సంవత్సరానికి మూడు జతలు యూనిఫామ్, చెప్పులు నూనెలు ఇవ్వాలి,8 గంటల పని దినాలు అమలు చేయాలి,
ఈ కార్యక్రమంలో
భీమన్న పాపన్న శాంతన్న, నర్సింహులు ,గోవిందు ,కృష్ణ వీరన్న భీమేష్ ,అయ్యన్న ,పెద్ద కిష్టన్న ,తదితరులు పాల్గొన్నారు.
Attachments area