గ్రామ సేవకులు 64 వ రోజు నిరవధిక సమ్మెను కొనసాగిస్తున్నారు

రాయికోడ్ జనం సాక్షి సెప్టెంబర్ 26రాయికోడ్ తహశీల్దార్ కార్యాలయం ముందు మండల గ్రామ సేవకులు 64 వ రోజు నిరవధిక సమ్మెను కొనసాగిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను అమలుచేయాలని కోరుతూ గ్రామ రెవెన్యూ సహాయకులు మంగళవారం నాడు రాయికోడ్ మండల తహశీల్దార్ కార్యాలయం ముందు 64 వ రోజు నిరవధిక సమ్మెను కొనసాగిస్తున్నారు. విఆర్ఏ లకు పేస్కెల్ జీవో ను వెంటనే విడుదల చేయాలి.
అర్వత కలిగిన విఆర్ఏ లకు ప్రమోషన్స్ కల్పించాలి. 55 సంవత్సరములు నిండిన విఆర్ఏ ల స్థానంలో వారసులకు ఉద్యోగాలు కల్పించాలని ఈ సందర్బంగా వ్యక్తపరుస్తూ వారి ప్రధాన డిమాండ్లను(ముఖ్యమంత్రి గారి హామీ లు) అమలుచేయాలని సీఎం కెసిఆర్ ను కోరారు . ఈ కార్యక్రమంలో విఆర్ఏల.జహీరాబాద్ డివిజన్ ఉపాధ్యక్షులు మరియు రాయికోడ్ మండలం అధ్యక్షులు జి పి రత్నం , ఉపాధ్యక్షులు శివకుమార్, కర్యదర్శి శ్రీశైలం, కొశదికారి లక్ష్మి, గోపాల్, వీరేందర్, అశోక్, విఠల్, విజయాలక్ష్మి, భాగ్యవతి, సుజాత, లక్ష్మి, ధుర్గన్నా, ఇస్మాయిలు, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.
Attachments area