ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు

 జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు.పార్టీ టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ చెంచల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆమె చిత్రపటానికి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు, కౌన్సిలర్ బైరు శైలేందేర్ గౌడ్  , సూర్యాపేట మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేని శ్రీనివాస్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం వారు మాట్లాడుతూ ఇందిరాగాంధీ పాలనలోనే దేశాభివృద్ధికి బాటలు వేశారని అన్నారు.బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఇందిరాగాంధీ అని కొనియాడారు.దేశాభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీ కీలకపాత్ర పోషించిందన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఐఎన్ టీయూసి వర్కింగ్ ప్రెసిడెంట్ కొండపల్లి సాగర్ రెడ్డి , జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పొలగాని బాలు గౌడ్ , నాగుల వాసు, రెబల్ శ్రీను , పిడమర్తి మల్లయ్య , కుందమల్ల శేఖర్ , అక్కేనపల్లి జానయ్య , తంగేళ్ళ కరుణాకర్ రెడ్డి, రావుల రాంబాబు, ఆలేటి మాణిక్యం , గార్లపాటి వెంకటరెడ్డి, నాగు నాయక్, చెరుకు రాము , అన్నమయ్య రాము, కోడి శివ, సత్యనారాయణ రెడ్డి, శిగ శ్రీను తదితరులు పాల్గొన్నారు.