ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ,మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు

మల్దకల్ జూలై 7 (జనంసాక్షి) మండల కేంద్రంలోని ఎమ్మార్పీఎస్ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణచేశారు. అదేవిధంగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు  మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు మల్దకల్ మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు తిమ్మన్న అధ్యక్షతన ఘనంగా గురువారం జరిగాయి.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా మాజీ జెడ్పిటిసి.భాస్కర్ మాదిగపాల్గొని కేక్ కటింగ్ చేశారు.అనంతరం జిల్లా నాయకులు  నీలిపల్లి మోషన్న మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం మందకృష్ణ జన్మదినం యావత్తు భారతదేశ ప్రజలకు గర్వించదగ్గ విషయమన్నారు.ఎబిసిడి వర్గీకరణ ద్వారా ఎంతో మంది విద్యార్థుల జీవితాల్లో ఉద్యోగాలను సాధించడం అంటేఎమ్మార్పీఎస్ పుణ్యమే అని అన్నారు.బిజెపి కేంద్ర ప్రభుత్వం ఆనాడు అధికారంలోకి రాకముందు వందరోజుల్లోనే వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చి నేటికీ అమలు చేయకపోవడం భాదాకరమని అన్నారు.ఇప్పటికైనా కేంద్ర బిజెపి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేపట్టి మాదిగ ఉపకులాకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో నీలిపల్లి సర్పంచ్ ప్రకాష్ ,శంకర్, లక్ష్మన్న ,యాకోబు ,ప్రభాకర్,బుచ్చన్న,పెద్ద కిష్టన్న ,జయనందం,రాజు, శాంతి కుమార్,నర్సింహులు,తదితరులు పాల్గొన్నారు
Attachments area