ఘనంగా కాళోజీ జయంతి

రాజోలి 09సెప్టెంబర్(జనం సాక్షి)
తెలంగాణ రాష్ట్రం గర్వించదగ్గ మహానుభావుడు కాళోజీ నారాయణ రావు అని తహశీల్దార్ జోషి శ్రీనివాస్ శర్మ,ఎంపీడీఓ గోవింద్ రావ్ అన్నారు. శుక్రవారం ఆయన జయంతి ని పురస్కరించుకుని కాళోజీ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కాళోజీ తన కలం తో అద్భుతాలు చేసారని, ప్రజా హక్కులకె పోరాడారని జనం గుండెల్లో కలం వీరుడిగా ముద్ర వేసుకున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ వెంకట రమణ,కలీమ్ తదితరులు పాల్గొన్నారు