*ఘనంగా చాకలి ఐలమ్మ వర్థంతి*

నేరేడుచర్ల(జనంసాక్షి) న్యూస్.తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ 37వ వర్ధంతిని స్థానిక సిపిఎం కార్యాలయం అరబండి భవన్లో శనివారం నాడు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పారేపల్లి శేఖర్ రావు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఐలమ్మ  ఘనమైన పాత్ర పోషించిందని,వెట్టి చాకిరి, బానిసత్వానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటం క్రమేనా అది భూమి, భుక్తి, విముక్తి పోరాటంగా మారిందన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి కొదమగుండ్ల నగేష్ మండల కార్యదర్శి సిరికొండ శీను, కుంకు తిరుపతయ్య, నీలా రామ్మూర్తి, ఎస్.కె ఆఫీజ్,సట్టు శ్రీను,బొల్లెపల్లి శ్రీను, భరత్, తదితరులు ఉన్నారు.