ఘనంగా జాతీయ గ్రంధాలయ వారోత్సవాలు.

మిర్యాలగూడ, జనం సాక్షి.
జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా కే ఎన్ ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మిర్యాలగూడ నందు ఈ రోజు విద్యార్ధులకు “ఇంపాక్ట్ ఆఫ్ లైబ్రరీస్ ఆన్ అకాడమిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్” అనే విషయంపై వ్యాసరచన పోటీ నిర్వహించినట్లు, గ్రంధాలయ సమాచార శాస్త్ర విభాగ అధిపతి, అసిస్టెంట్ ప్రొఫెసర్ రాచమల్ల శ్రీనివాస్ తెలిపారు. ఇందులో విద్యార్దిని విద్యార్థులు పాల్గొని వారి ప్రతిభను చాటుకున్నారు అని అన్నారు. ప్రిన్సిపాల్ వెంకటరమణ మాట్లాడుతూ విద్యార్థులు తమ జ్ఞానాన్ని పెంపొందించుకుని బంగారు భవిష్యతుకు మార్గం నిర్మించుకోవాలని విద్యార్ధులను కొనియాడారు.