*ఘనంగా పెరియార్ 143వ జయంతి*.

ఉండవల్లి,సెప్టెంబర్ 17(జనంసాక్షి): అలంపూర్ నియోజకవర్గం ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తా లో
కులరహిత సమాజం కోసం నిరంతరం పోరాడి జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మేధావి, సంఘసంస్కర్త, సామాజిక ఉద్యమకారుడు పెరియర్ ఈవి రామస్వామి నాయకర్ అని బహుజన సమాజ్ పార్టీ జిల్లా  ఆర్గనైజింగ్ సెక్రటరీ రేపల్లె రాజు మరియు  ఉండవల్లి మండల కన్వీనర్ మల్లే పోగు ప్రభుదాస్ అన్నారు. బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం ఉండవల్లి  మండల పరిధిలోని అలంపూర్ చౌరస్తాలో పెరియార్ ఈవి రామస్వామి నాయకర్ 143వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమాజంలో కులం ఉండరాదని.. విద్యకు అధిక ప్రాముఖ్యత ఇచ్చిన గొప్ప మేధావి అదేవిధంగా సమాజంలో సమానత్వం కోసం నిరంతరం పోరాడినారని వారు పేర్కొన్నారు. దేశంలో దోపిడి వర్గాల నిర్మూలించినప్పుడు సమానత్వం ఏర్పడుతుందని.. గట్టిగా నమ్మిన గొప్ప మేధావి పెరియార్ గారు అని అన్నారు. ఆయన ఆలోచనలను యువత స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాలని సూచించారు. జయంతి వేడుకలలో బహుజన సమాజ్ పార్టీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ రేపల్లె రాజు, ఉండవల్లి మండల కన్వీనర్ మల్లె పోగు ప్రభుదాస్,K. నాగరాజు, మల్లు, వజీద్, గోకారీ, విజయ్, లోకేష్ తదితరులు  పాల్గొన్నారు .
Attachments area