ఘనంగా ప్రోపెసర్ కోదండరాం జన్మదిన వేడుకలు

ఇబ్రహీంపట్నం ,సెప్టెంబర్ 05 ,(జనం సాక్షి ) ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.
తెజస జిల్లా కార్యదర్శి చింతకుంట శంకర్ పాల్గొని కేకు కోసి అనంతరం మాట్లాడుతూ తెలంగాణ అస్తిత్వ పోరాటంలో అమరులు ఆశయాలు నెరవేరలేదని,అమరుల ఆశయ సాధనకు పార్టీ నాయకులు యువత నడుం బిగించాలని అన్నారు.జన్మదిన వేడుకల్లో టీజేఎస్ జిల్లా కార్యదర్శి చింతకుంట శంకర్, మండల అధ్యక్షులు కంతి రమేష్, రైతు నాయకులు మల్లయ్య యాదవ్,కంతి సంజీవ్,ల్యాడ రాజారెడ్డి,బాస సంధ్య రెడ్డి, కాట దశరత్ రెడ్డి, టీజేఎస్ మండల్ కార్యదర్శి కళాల ప్రవీన్ ముదిరాజ్,యువ జనసమితి నాయకుడు యేశలగంగారెడ్డి,కంతి ప్రశాంత్, తిరుపతి,మానాల తేజ,కాల రవి,కంతి రంజిత్,బద్దీ రాములు,గుమ్మడి నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.