ఘనంగా మిలాద్‌-ఉన్‌-నబీ వేడుకలు

మహబుబ్ నగర్ అర్ సి, అక్టోబరు 9 (జనంసాక్షి ) :
మహమ్మద్‌ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని ఆదివారం జిల్లా వ్యాప్తంగా  మిలాద్‌-ఉన్‌-నబీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. మహబుబ్ నగర్ పట్టణంలోని ఖలీల్ చౌక్ ,షాషాబ్ గుట్ట ,మదీనా మస్జిద్  ,గోల్ మస్జిద్ ,నుండి ర్యాలీగా తరలివచ్చి గడియారం చౌరస్తాలో భారీ ప్రదర్శన నిర్వహించారు . ఖలీల్ చౌక్ ,ఫైర్ స్టేషను ఏరియాలో జరిగిన ర్యాలీలో చిన్నారుల ప్రత్యెక ఆకర్షణగా  నిలిచారు.  ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మహమ్మద్‌ ప్రవక్త ప్రపంచానికి శాంతి, సౌభ్రాతృత్వాలను సోదరభావాన్ని బోధించారని గుర్తు చేశారు. వారి మార్గంలో పయనిస్తూ ప్రపంచ మానవాళి శ్రేయస్సు కోసం ప్రార్థించాలని సూ చించారు. మహమ్మాద్‌ప్రవక్త జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని సన్మార్గంలో నడుస్తూ వారి బోధనలు సార్థకం చేయాలని కోరారు.