*ఘనంగా వజ్రోత్సవ ర్యాలీ*

వీపనగండ్ల ఆగస్టు 13 (జనంసాక్షి) వీపనగండ్ల మండల కేంద్రంలో శనివారం 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా మండల కేంద్రంలో భారీ ర్యాలీ ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు గ్రామ యువకులు ప్రభుత్వ ఉద్యోగులు మరియు ప్రజా ప్రతినిధులు ఘనంగా ర్యాలీ నిర్వహించి ఊరేగింపు చేశారు. స్థానిక సర్పంచ్ వంగూరు నరసింహ రెడ్డి, తాసిల్దార్ పాండు నాయక్, ఎంపీడీవో కథలప్ప, ఎస్సై రామన్ గౌడ్, ఏపిఎం రాజశేఖర్రెడ్డి, ఏపీవో శేఖర్ గౌడ్, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ రామ్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, మంజుల, కస్తూర్బా పాఠశాల ఉపాధ్యాయులు వివిధ శాఖల ఉద్యోగులు గ్రామ యువకులు ప్రజలు విద్యార్థులు కలిసి భారీగా ర్యాలీ నిర్వహించడం జరిగింది.