ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు. మల్కాజిగిరి,అక్టోబర్31(జనంసాక్షి)

సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలను కొనసాగిస్తామని మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే,బిజెపి నాయకులు ఆకుల రాజేందర్ అన్నారు.సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి ని పురస్కరించుకొని ఎస్పీ నగర్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు.ఈకార్యక్రమంలో బిజెపి నాయకులు వీకే మహేష్, సదానంద గౌడ్,విఠోబా,నరసింహ గౌడ్,చంద్రశేఖర్,బక్కనాగరాజ్,డిఎల్ వెంకటేష్,జీడి బాలచందర్ గౌడ్, సునీల్,తుపాకుల జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.