చంద్రబాబుకు మళ్లీ షాక్‌

అమరావతి,సెప్టెంబర్‌22( జనం సాక్షి  )
స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్టయిన చంద్రబాబుకు మళ్లీ షాక్‌ తగిలింది. హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టేసింది. మరోవైపు రెండురోజుల పోలీసు కస్టడీకి అనుమతిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీచేశారు. కనీసం ఐదురోజుల కస్టడీ ఇవ్వాలని సీఐడీ కోరగా.. జడ్జి రెండురోజుల విచారణకు అనుమతించారు. రాజమహేంద్రవరం జైలులోనే విచారణ చేయాలని న్యాయమూర్తి తన ఉత్తర్వులో పేర్కొన్నారు. కేసు విషయంలో జరుగుతున్న పరిణామాలతో తెలుగుదేశం పార్టీ నేతలు మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.