చంద్రబాబు నాయుడు విడుదల పట్ల టిడిపి నాయకుల సంబరాలు

చేర్యాల (జనంసాక్షి) అక్టోబర్ 31: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జైలు నుండి విడుదల కావడం పట్ల మంగళవారం చేర్యాల ప్రాంత తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ వద్ద బాణసంచా కాల్చి ఘనంగా సంబరాలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా టిడిపి మండల అధ్యక్షులు కుర్రారం బాల నర్సయ్య, కొమురవెల్లి మండల అధ్యక్షులు పబ్బోజు రాములు చారి లు మాట్లాడుతూ.. అభివృద్ధి ప్రదాత 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేసిన గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు మీద ఎలాంటి ఆధారాలు లేకుండా అక్రమంగా కేసులు పెట్టి 52 రోజులు జైల్లో నిర్బంధించి పైశాచిక ఆనందం పొందారని వారన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోడీ కుమ్మక్కై మహా నాయకులపై లేనిపోని అబాండాలు మోపి ఎన్నో ఇబ్బందులకు నిర్బంధాలకు గురిచేశారని, జైల్లో పెట్టి ఆయనపై ఏం సాధించారని విమర్శించారు. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమేనని ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారికి అదే గతి పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో చేర్యాల టిడిపి పట్టణ అధ్యక్షులు మిట్టపల్లి నారాయణరెడ్డి, పట్టణ కార్యదర్శి బీర్ల శ్రీరాములు, పాము శివలింగం, ఎండి ఎక్బాల్, కమలాపురం కిష్టయ్య, నర్ర కేశవులు, వల్లెపు వెంకటేశం, పల్లపు కనకరాజు తదితరులు పాల్గొన్నారు.