చంద్రబాబే సమర్థుడైన సిఎం

వైసిపి పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత
టిడిపి నేత అచ్చన్నాయుడు ట్వీట్‌
అమరావతి,ఆగస్ట్‌2(జ‌నంసాక్షి): ఎపి ప్రజలు సమర్థుడైన చంద్రబాబునే సిఎంగా ఉండాలని కోరుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. వైసీపీ ప్రభుత్వం తీరుతో ప్రజలు విగిసి పోయారని అంటే ట్వీట్‌ చేశారు. గత మూడేళ్లలో దళితులపై దాడులు, ఆడపిల్లలపై అత్యాచారాలు, కల్తీ మద్యం, ప్రతిపక్షాల నాయకులు, కార్యకర్తలపై దాడులు, భూ కబ్జాలు, మైనింగ్‌ మాఫియా, శ్యాండ్‌ మాఫియా, ల్యాండ్‌ మాఫియా, మట్టి మాఫియా, కోర్టు ధిక్కారాలు, చెత్త రోడ్లు, పూర్తిగా నిలిచిపోయిన అభివృద్ధి, లక్షల కోట్లలో ప్రభుత్వం విచ్చలవిడిగా చేస్తున్న అప్పులు, అధికార పార్టీ నేతల ఆగడాలు చూసి చూసి, సామాన్య ప్రజలు ఎప్పుడో డిసైడ్‌ అయిపోయారు. ఈసారి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారే ఏపీకి సీఎం కావాలి అని. కానీ కేవలం మూడంటే మూడేళ్ళలో సొంత పార్టీ కార్యకర్తలు, అభిమానులకు కూడా జగన్‌ రెడ్డి నైజం, అతని అసమర్థ పాలన గురించి అర్థమైపోయింది. బహిరంగంగా తమ అసంతృప్తి వెళ్లగక్కడమే కాదు, ఈసారి తమ పార్టీ గెలిచే పరిస్థితి లేనే లేదని వారే స్వయంగా చెబుతున్నారని అచ్చెన్నాయుడు ట్వీట్‌ చేశారు.