చరిత్రలో మంచిని మంచిగా చెడును చెడుగా చెప్పుకోవాలి

*వనపర్తి* *టౌన్* : సెప్టెంబర్16 ( *జనం* *సాక్షి* )

చరిత్రలో మంచిని మంచిగా
చెడును చెడుగా చెప్పుకోవాలి

దేశంలో ఉన్న ప్రజలందరూ ఒక్కటేనన్న సమైక్యతను చాటాలి

1947 ఆగస్ట్ 15న దేశానికి స్వాతంత్ర్యం వస్తే 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ దేశంలో విలీనమయింది

1956 నవంబరు 1 న ఆంధ్రప్రదేశ్ లో కలిసి 2014న సుధీర్ఘ పోరాటంతో తిరిగి తెలంగాణను సాధించుకున్నాం

దేశంలోని 565 సంస్థానాలు మొఘల్ చక్రవర్తుల కింద ఆయా సంస్థానాధీషుల పాలనలో ఉండేవి

ఔరంగజేబు ఔరంగాబాద్ కు స్వాతంత్ర్యం ఇచ్చి అసఫ్ జాహీల చేతిలో పెట్టాడు

బ్రిటీష్ వారితో యుద్దంలో నిజాం రాజులు సంధి చేసుకుని మొదట రాయలసీమ ప్రాంతాలు, తర్వాత ఉత్తరాంద్ర ప్రాంతాలను బ్రిటీష్ వారికి అప్పగించారు

తెలంగాణ, మహారాష్ట్రలో 5 జిల్లాలు, కర్ణాటక లోని కొంత ప్రాంతం చివరకు నిజాంల చేతిలో మిగిలాయి

నిజాంల కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి .. అదే సమయంలో అన్యాయాలు కూడా జరిగాయి

చివరి నిజాంల హయాంలో పరిపాలనలో అనేక సంస్కరణలు తీసుకువచ్చారు

భూములన్నీ జమీందార్లు , జాగిర్దార్ల చేతుల్లో ఉండడంతో ప్రజలు భూమి కోసం – భుక్తి కోసం మొదలుపెట్టిన పోరాటం సాయుధ పోరాటంగా మారింది

నిజాం పాలనలోనే స్వతంత్ర న్యాయవ్యవస్థ