*చాకలి ఐలమ్మ ఉద్యమ స్ఫూర్తితో బహుజన రాజ్యం సాధిస్తాం*

*అలంపూర్ బీఎస్పీ పార్టీ ఇంచార్జి మహేష్*      *అలంపూర్ సెప్టెంబర్ 10(జనం సాక్షి )*  ఉద్యమ స్ఫూర్తికి మారుపేరైన వీరనారి చాకలి ఐలమ్మ పూర్తి తో బహుజన రాజ్యం స్థాపించాలని బహుజన సమాజ్ పార్టీ అలంపూర్ ఇంచార్జ్ మహేష్ అన్నారు. అలంపూర్ శనివారం పట్టణంలోని తెలంగాణ భూ పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహానికి 37 వ వర్ధంతి పురస్కరించుకొని  పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల తెగువ పోరాట పటిమను ప్రపంచానికి తెలియజేసిన వీరనారి చాకలి ఐలమ్మ అన్నారు. రజాకార్లను ఎదిరించి వారి చేతిలో  ఉన్నటువంటి భూమిని పోరాటంతో జయించి తిరిగి పేద ప్రజలకు పంచిన మొట్టమొదటి మహిళా  అన్నారు. రాబోయే రోజుల్లో ఆమెను స్ఫూర్తిగా తీసుకుని గ్రామ గ్రామాన  ప్రజలకు అవగాహన కల్పిస్తూ బహు జన రాజ్యం సాధిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బి ఎస్ పి నాయకులు  సుంకన్న, మద్దిలేటి, రవి, తదితరులు పాల్గొన్నారు.