చింతలకుంట యూత్ ఆధ్వర్యంలో ఘనంగా జడ్పీ చైర్‌ పర్సన్‌ సరితా తిరుపతయ్య జన్మదిన వేడుకలు

ధరూర్ సెప్టెంబరు 06 (జనంసాక్షి):- : జోగులాంబ గద్వాల జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సరిత తిరుపతయ్య  జన్మదిన వేడుకలను మంగళవారం చింతలకుంట యువత ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌ నివాసం వద్ద కేక్‌కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం పార్టీ నాయ కులు, కార్యకర్తలు ప్రభుత్వాస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చింతలకుంట నాయకులు, యువత, అభిమానులు  పాల్గొన్నారు.