చికిత్స పొందుతూ యువకుడు మృతి

మల్దకల్ సెప్టెంబర్ 19 (జనంసాక్షి) మండల పరిధిలోని పాల్వాయి గ్రామంలో గత మూడు రోజుల క్రితం వ్యవసాయ పొలంలో పత్తి చేనుకు క్రిమిసంహారక మందు పిచికారి చేస్తుండగా కురువ ఈశ్వరయ్య (17) తీవ్ర అస్వస్థతకు గురై చికిత్స నిమిత్తం గద్వాల ఏరియా ఆసుపత్రికి తరలించగా డాక్టర్ల సూచన మేరకు కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఆదివారం చికిత్స పొందుతూ మృతి చెందినట్లు హెడ్ కానిస్టేబుల్ గోపాల్ నాయక్ తెలిపారు.తండ్రి దేశన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కుటుంబంలో పెద్దదిక్కుగా ఉన్న ఈశ్వరయ్య కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు అకాల మృతి చెందడంతో కుటుంబం భారం అంతా తానే చూసుకునేవాడని, కుటుంబంలోని ఐదు మంది దివ్యాంగులు ఉన్నారు. వీరికి ఆలన పాలన చూసుకునేవాడని,ఈశ్వర్ మృతి చెందడంతో కుటుంబాన్ని పోషించేవారు లేకపోవడంతో తల్లిదండ్రులు వృధ్యాపం ఉండడంవల్ల కుటుంబమంతా చిన్న భిన్నమయింది.ప్రభుత్వము కానీ దాతలు కానీ ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా దివ్యాంగుల సేవా సంఘం 10,000 ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేశారు.