చిన్నపాటి మ్యూజియంగా పివి నివాసం

వరంగల్‌ అర్బన్‌,అక్టోబర్‌25(జ‌నంసాక్షి): వరంగల్‌ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలోమాజీ ప్రధాని పీవీ నర్సింహారావు ఇంటిని చిన్నపాటి మ్యూజియంగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం ఇంటిని పాక్షికంగా కూల్చివేశారు. పీవీ ప్రధానిగా ఉన్న సమయంలో  సీఆర్పీఎఫ్‌ బలగాల కోసం ఇంటిని విస్తరించారు. ఇప్పుడు ఆ విస్తరించిన ఇంటిని కూల్చి వేశారు. ఈ స్థలంలో అధునాతన ఇంటి నిర్మాణాన్ని చేపట్టాలని పీవీ కుటుంబ సభ్యులు నిర్ణయించారు. కొత్తగా నిర్మించే ఇంట్లో పీవీకి సంబంధించిన వస్తువులను భద్రపర్చి, చిన్నపాటి మ్యూజియంగా మార్చాలని వారు భావిస్తున్నారు. ఇంటి ముందర భాగంలో ఉన్న గడీ ని మాత్రం అలాగే ఉంచారు. దీనికోసం కుటుంబ సభ్యులు పూనుకున్నారు.