చిన్న వ్యాపారులకు తోడ్పాటు

23qbs4b7చైనాకు చెందిన అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థ ఆలీబాబా చైర్మన్ జాక్ మా ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. భారత్ లోని చిన్న వ్యాపారులకు సంస్థ ఏ విధంగా తోడ్పడాలనుకుంటున్నదో ఈ సందర్భంగా ఆయన ప్రధానికి వివరించారు. ఈ నాలుగు నెలల్లో జాక్ మా ఇండియాకు రావడం ఇది రెండోసారి. మన దేశంలోకి సైతం వ్యాపార కార్యకలాపాలను విస్తరించేందుకు ఆలీబాబా తీవ్రంగా ప్రయత్నిస్తున్నది.