*చిరు వ్యాపారులకు చెక్కులు అందజేసిన పుర చైర్మన్ ఎడ్మ సత్యం

పట్టణ పరిధిలో ఉన్న చిరువ్యాపారులకు పీఎం ఎఫ్ ఏం పథకం ద్వారా మంజూరు అయిన చెక్కులను బుధవారం పుర చైర్ ఎడ్మ సత్యం చేతులమీదుగా 8 మంది లబ్దిదారులకు అందించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణ మహిళ సమాఖ్య ఎస్ఎల్ఎఫ్ గ్రూప్లలో ఉన్న చిన్న వ్యాపారులకు ప్రధానమంత్రి ఫుడ్ మేనేజ్మెంట్ పథకం ద్వారా మంజూరు అయినటువంటి 40వేల రూపాయల చెక్కులను మహిళ సంఘంలా లబ్ధిదారులకు అందించడం జరిగింది, ఇట్టి రూపాయల వారి వ్యాపారాలను అభివృద్ధి చేసుకొనుటకు ఇట్టి చెక్కు వారికి చాలా ఉపయోకారంగ ఉంటుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ జాకీర్ హమ్మద్, నాయకులు నూనె శ్రీనివాస్, మహిళ సంఘం సభ్యులు పాల్గొన్నారు.