చీకోటి వెనక వైసిపి నేతల ప్రమేయం:కొనకళ్ల

అమరావతి,జూలై30 ( జనంసాక్షి):   చికోటి ప్రవీణ్‌ చీకటి చరిత్ర వెనుక వైసీపీ పెద్దలున్నారని మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ ఆరోపించారు. శనివారం ఆయన విూడియాతో మాట్లాడుతూ చికోటి ప్రవీణ్‌ను గుడివాడకు తీసుకొచ్చిందెవరు?.. క్యాసినోకు నిధులు సమకూర్చిందెవరు? అని ప్రశ్నించారు. గుడివాడ క్యాసినోపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసినా ఇంతవరకు చర్యలు తీసుకోలేదని విమర్శించారు. చికోటి ప్రవీణ్‌ సీఎం జగన్‌కు ఎంత వాటా ఇచ్చారో తేలాలని డిమాండ్‌ చేశారు. అనుమతి లేని చోట్ల క్యాసినో ఎలా నిర్వహించారో ఈడీ తెలపాలని కొనకళ్ల నారాయణ డిమాండ్‌ చేశారు.