*చేయూతనిచ్చిన తోటి స్నేహితులు.

 చిట్యాల సెప్టెంబర్14( జనంసాక్షి )ఇటీవల మండలంలోని నవాబుపేట గ్రామానికి చెందిన గొపగాని ఓదెలు తన వృత్తిలో భాగంగా తాటి చెట్టు నుండి ప్రమాదవశాత్తు కింద పడంతో తీవ్ర గాయాలు కాగా బుధవారం తన పదవ తరగతి మిత్ర బృందం 20వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేసి తన ఔన్నత్యాన్ని నిలుపుకున్నారు. తనకు అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు .ఈ కార్యక్రమంలో 10వ తరగతి మిత్ర బృందం తౌటం రాజు, బొచ్చు రాజు, బుర్ర వెంకటేష్ గౌడ్, మైదం. మహేష్ ,పింగిలి శ్రీకాంత్, చింతల రాజేందర్ ,విజయ్, దుగ్యాల రమేష్ తదితరులు పాల్గొన్నారు.