చైనాలో భారీ భూకంపం వల్ల 30 మంది మృతి

బీజింగ్‌: చైనాలోని సిచాన్‌ ప్రాంతంలో ఈ తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై 7గా నమోదైంది. ఈ ఘటనలో 30 మందికిపైగా మృతి చెందగా.. నాలుగు వందల మందికిపైగా గాయపడినట్లు చెనా సెంట్రల్‌ టెలివిజన్‌ వెల్లడించింది. భూప్రకంపనల ధాటికి లుషాన్‌ ప్రాంతంలోని యాన్‌ నగరంలో ప్రజలు భయంతో రహదారులపైకి పరుగులు తీశారు. బాధిత ప్రాంతాల్లో సైన్యం సహాయక చర్యలు చేపట్టింది.