చైనాలో భూకంపం , 156 మంది దుర్మరణం

బీజింగ్‌ : చైనాలోని సిచువాస్‌ ప్రావిన్స్‌లో శనివారం భారీ భూకంపం సంభవించింది. భూకంపంలో 156 మంది మృతి చెందగా దాదాపు 5,500మంది గాయపడ్డారు .రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 7.0 గా నమోదైంది. ఇదే ప్రాంతంలో 2008లో సంభవించిన భూకంపం భారీ ప్రాణ నష్టాన్ని ,ఆస్థి నష్టాన్ని కలిగించింది.