జంట జలాశయాలకు వరద ప్రవాహం

రంగారెడ్డి: జిల్లాలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జంట జలాశయాలు ఉస్మాన్‌ సాగర్‌, హిమాయత్‌ సాగర్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.

హుస్సేన్‌సాగర్ నిండుకుండలా మారింది. మూసీ నదిలో వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మూసారం బాగ్‌ వంతెనను తాకుతూ వరద ప్రవహిస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో ప్రజల ఫిర్యాదులు స్వీకరించేందుకు టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేశారు. టోల్‌ఫ్రీ నంబర్‌ 040 21111111, డీఆర్‌ఎఫ్‌ నంబర్‌ 90001 13667.

ఉస్మాన్‌ సాగర్‌కు పెద్దఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. వరద పరిస్థితులపై జీహెచ్ఎంసీ, పురపాలక శాఖ తమ సిబ్బందిని అప్రమత్తం చేస్తోంది. ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని అధికారులు సూచిస్తున్నారు. భారీ వర్షాలకు షాద్‌నగర్‌లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.