జగన్‌ ఓ మోసపు నేత

మండిపడ్డ కాల్వ శ్రీనివాసులు

అనంతపురం,జూలై9(జనంసాక్షి): ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి కాదు జగన్‌ మోసపు రెడ్డి అని టీడీపీ నేత, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. శనివారం విూడియాతో మాట్లాడుతూ.. కాల్వ శ్రీనివాసులుకు ఛాలెంజ్‌ వేసే సత్తా కాపు రామచంద్రరెడ్డికి లేదన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి
బుద్ది లేదా… పోలీసులను అడ్డుపెట్టుకొని మమ్మల్ని ఆపుతావా? మమ్మలి అడ్డుకోవడం అంటే ప్రజాస్వామ్య హక్కులను అడ్డుకున్నట్లే అని అన్నారు. పట్టుదల తెగింపులో టీడీపీ కార్యకర్తలు ఎక్కడ వెనక్కి తగ్గరని స్పష్టం చేశారు. పోలీసులు ఇంత అన్యాయంగా అడ్డుకుంటున్నారని… న్యాయస్థానానికి పోయి పాదయాత్ర కార్యక్రమం చేపడుతామన్నారు. బీటీపీకి నీళ్లిచే పాలన రాబోతుందని.. చంద్రబాబు పాలన వస్తుంది బైరావని తిప్ప ప్రాజెక్ట్‌కు కృష్ణా జాలాలు తీసుకువస్తామని కాల్వ శ్రీనివాసులు స్పష్టం చేశారు. కాల్వను అడ్డుకున్న పోలీసులు…జీడిపల్లి భైరవానితిప్ప ప్రాజెక్ట్‌ పనులు గత మూడు సంవత్సరాలుగా ముందుకు సాగని పరిస్థితి నెలొంది. ఈ క్రమంలో ఈరోజు ఉదయం రైతులతో కలిసి గుమ్మగట్ట నుంచి బీటీ ప్రాజెక్టు వరకు పాదయాత్ర చేపట్టేందుకు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు సిద్ధమవగా… పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. పాదయాత్రకు వెళ్తున్న కాల్వను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.