జనవరి 5న సీఎం వరంగల్ పర్యటన

996633ముఖ్యమంత్రి కేసీఆర్ జనవరి 5న వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11గంటలకు భూపాలపల్లిలో కేటీపీపీ స్టేజ్-2 విద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. 600 మెగావాట్ల ఈ విద్యుత్ కేంద్రాన్ని జాతికి అంకితం చేయనున్నారు. అదేరోజు మధ్యాహ్నం జిల్లా అభివృద్ధిపై కలెక్టరేట్ లో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. టెక్స్ టైల్ పార్క్ నిర్మాణం, మిషన్ భగీరథ, వరంగల్ నగర అభివృద్ధిపై చర్చించనున్నారు .ఇక కాకతీయ కాల్వల మరమ్మత్తుతో పాటు మేడారం సమ్మక్క,సారలమ్మ జాతర ఏర్పాట్లను సీఎం కేసీఆర్ సమీక్షించనున్నారు.