జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో హింసాత్మక ఘటనలు
విద్యుత్ ప్రాజెక్టులపై చర్చ సందర్భంగా రభస
అధికార, ప్రతిపక్ష సభ్యుల పరస్పర దాడులు
జమ్మూకశ్మీర్, మార్చి 27 : విద్యుత్ ప్రాజెక్టులపై చర్చ సందర్భంగా రాష్ట్ర అసెంబ్లీలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. అధికార పీడీపీ, ప్రతిపక్ష నేషనల్కాన్ఫరెన్స్ సభ్యులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. విపక్ష సభ్యులు స్పీకర్ పోడియం వైపు దూసుకెళ్లేందుకు యత్నించగా వారిని అడ్డుకునేందుకు అధికారపక్ష సభ్యులు ప్రయత్నించారు. విద్యుత్ ప్రాజక్టులను రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి తేవడంలో పీడీపీ, బీజేపీ సర్కారు విఫలమైందని నేషన్ కాన్ఫరెన్స్ ఆరోపించింది. సభలోనే ధర్నాకు దిగింది.