జర్మన్‌ బేకరిపేలుళ్ల కేసులో దోషి హిమాయత్‌

పుణె, జనంసాక్షి: జర్మన్‌ బేకరి పేలుళ్ల కేసులో మీర్జా హిమాయత్‌బేగ్‌ను దోషిగా కోర్టు తేల్చింది. 2010లో బేకరి దగ్గర టెర్రరిస్టులు బాంబు పేల్చారు.అప్పటి ఘటనలో 17 మంది మృతి చెందగా, 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. బేగ్‌తో పాటు మరో ఐదుగురు నిందితులను కోర్టు దోషులుగా పేర్కొంది.