జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులను ప్రకటించిన కేంద్రం


ఏపీలో ఇద్దరికి, తెలంగాణలో ఇద్దరికి చోటు
దేశవ్యాప్తంగా 44 మంది ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక
న్యూఢల్లీి,ఆగస్ట్‌18(జనంసాక్షి): జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశ వ్యాప్తంగా 44 మంది ఉపాధ్యాయులను పురస్కారాలకు కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురు ఎంపికయ్యారు. వారిలో తెలంగాణ, ఏపీ నుంచి ఇద్దరు చొప్పున ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. తెలంగాణలోని ఆసిఫాబాద్‌ జిల్లా ఎంపీపీఎస్‌ సావర్‌ ఖేడ్‌ యాక్టింగ్‌ హెచ్‌ ఎం రంగయ్య, సిద్దిపేట ఇందిరానగర్‌ జడ్పీహెచ్‌ఎస్‌ హెడ్‌ మాస్టర్‌ రామస్వామి ఎంపికయ్యారు. ఏపీ నుంచి విశాఖ లింగరాజుపాలెం హైస్కూల్‌ ఉపాధ్యాయుడు భూషణ్‌ శ్రీధర్‌, చిత్తూరు ఐరాల పాయిపల్లి హైస్కూల్‌ ఉపాధ్యాయుడు మునిరెడ్డిని అవార్డుకు ఎంపిక చేశారు.