జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార నమోదు గడువు పెంపు.

డిఈఓ గోవిందరాజులు.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, జూన్22(జనం సాక్షి):
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఆన్లైన్లో నమోదు చేసుకోవడానికి గడువు పెంచారని  జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు  ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, ఎయిడెడ్, నవోదయ మరియు కేంద్రీయ యాజమాన్య పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఈ అవార్డుకు అర్హులు.national awardstoteachers.education.gov.in అనే వెబ్ సైట్ లో30.06.2022 తేదీ లోపు నమోదు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరములకు జిల్లా సైన్స్ అధికారి కృష్ణా రెడ్డి(9989921105) ని  సంప్రదించాలని ఆయన కోరారు.