*జాతీయ జెండాల పంపిణీ చేసిన

ఎంపీడీవో కథలప్ప
*
వీపనగండ్ల ఆగస్టు 12 (జనంసాక్షి) మాతృభూమి కోసం తమ ధన, మాన, ప్రాణాలను త్యాగం చేసిన వారెందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా సిద్ధించిన స్వాతంత్ర 75వ వజ్రోత్సవాల సందర్భంగా మండల కేంద్రంలోని వివిధ గ్రామాలలో ఎంపీడీవో కథలప్ప జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమాన్నికి శుక్రవారం రోజున శ్రీకారం చుట్టారు. వీపనగండ్ల మండల కేంద్రంలోని సంగినేనిపల్లి మరియు కల్వరాల గ్రామాలలో ఇంటింటా జాతీయ జెండా పతాకాలను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు జాతీయ స్ఫూర్తిని, దేశభక్తిని కలిగి ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కల్వరాల సర్పంచ్ రఘునాథ్ రెడ్డి మరియు సంగినేనిపల్లి పంచాయతీ కార్యదర్శి శ్యాంసుందర్ తదితరులు పాల్గొనడం జరిగింది.