జాతీయ పతాకం తో కృష్ణాష్టమి వేడుకలు

వరంగల్ ఈస్ట్, ఆగస్టు 19(జనం సాక్షి)
వరంగల్ నగరంలోని అండర్ రైల్వే గేట్ కరీమాబాద్ ప్రాంతంలో శుక్రవారం శ్రీ కృష్ణ జన్మాష్టమి పర్వదినం సందర్భంగా స్థానిక కివి పబ్లిక్ స్కూల్ లో శ్రీకృష్ణ జన్మదిన వేడుకలను వైభవంగా నిర్వహించారు .ఈ సందర్భంగా భారత దేశం జాతీయ స్వాతంత్ర్య వజ్రోత్సవాల పురస్కరించుకుని విద్యార్థులు జాతీయ పతాకం చేతబూని శ్రీకృష్ణుడు గోపికల వేషధారణలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ రకాల భక్తి పాటలతో అలరించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ దాసి సతీష్ మూర్తి మాట్లాడుతూ భారత సంస్కృతి సంప్రదాయాలను పిల్లలకు తెలిసేలా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సతీష్ మూర్తి తో పాటు ఉపాధ్యాయులు  విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.