జానారెడ్డిని అడ్డుకున్న తెలంగాణావాదులు

నల్గొండ:  జిల్లాలోని పానగల్‌ దగ్గర ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసేందుకు వచ్చిన మంత్రి జనారెడ్డిని తెలంగాణవాదులు, కాంగ్రెస్‌ కార్యకర్తలు అడ్డుకున్నారు. మంత్రి పదవికీ రాజీనామా చేయాలని  వారు డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో జానారెడ్డి ఇందిరాగాంధీకి నివాళులు అర్పించకుండానే వెనుదిరిగారు.