జిల్లా స్థాయికి ఎంపికైన విద్యార్థి

మక్తల్ సెప్టెంబర్ 20 (జనంసాక్షి) : నర్వ మండలంలోని కల్వల గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన కే రాము నిజామాబాద్ జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి త్రో బాల్ ఛాంపియన్స్ లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి జాతీయస్థాయికి ఎంపికైనట్లు పిఈటి విష్ణువర్ధన్ తెలిపారు. ఈనెల 22 నుంచి 26 వరకు తమిళనాడులో జరిగే జాతీయస్థాయి త్రో బాల్ ఛాంపియన్షిప్లో పాల్గొంటారని తెలిపారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎండి బాషిర్ అహ్మద్ మరియు ఉపాధ్యాయులు దామోదర్ రెడ్డి సురేష్ సర్పంచ్ మహేశ్వరమ్మ మహేశ్వర్ రెడ్డి ఎంపిటి సుధాకర్ రెడ్డి తదితరులు అభినందించారు.