జుక్కల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాంతారావు

బిచ్కుంద అక్టోబర్ 27 (జనంసాక్షి) రాబోయే ఎన్నికల్లో జుక్కల్ నియోజకవర్గానికి అభ్యర్ధిగా తోట లక్ష్మి కాంతారావును అధిష్టానం ప్రకటించింది. దీంతో ఊహించిన విధంగానే కార్యకర్తల్లో సంబరాలు అంబరాన్ని అంటాయి. ఉరకలెత్తే ఉత్సాహంతో వందల మంది ప్రజలు రోడ్ల మీదకు వచ్చారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. కమల్ కిషోర్, అస్పత్ వార్ వినోద్, సందాని, సలీమ్, ఇమ్రాన్, సాహెబ్ రావు, రాంరెడ్డి, వినయ్ తదితర అభిమానులు పండగ వాతావరణాన్ని నెలకొల్పారు. ఇది కాంగ్రెస్ పార్టీకి జుక్కల్ నియోజకవర్గంలో నైతిక విజయమని, అఖండమైన మెజారిటీతో తోట లక్ష్మి కాంతారావును గెలిపించుకుంటామని పేర్కొన్నారు.