జూలపల్లి లో గడపగడపకు కాంగ్రెస్ నాయకుల ప్రచారం

జనంసాక్షి, కమాన్ పూర్, అక్టోబర్ 30 : మేనిఫెస్టో కమిటీ చైర్మన్ , మంథని ఎంఎల్ఎ దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు మంథని నియోజకవర్గ పరిధిలోని కమాన్ పూర్ మండలం జూలపల్లి గ్రామములోని మంగళవారం కాంగ్రెస్ నాయకులు తెలంగాణ కాంగ్రేస్ ఆరు గ్యారంటీ పధకాలను గడపగడపకు తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. తెలంగాణలో కాంగ్రేస్ పార్టీ అధికారంలోకి రాగానే మహాలక్ష్మి, రైతు భరోసా, గృహలక్ష్మి, ఇందిరమ్మ, యువ వికాస, చేయూత పథకంను అమలు చేస్తుందని ప్రజలకు వివరించారు. రాబోయే ఎన్నికల్లో మంథని ఎమ్మెల్యేగా దుద్దిల్ల శ్రీధర్ బాబును భారీ మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆడపు రమేష్, ఎంపీటీసీ శివశంకర్, మాజీ ఎంపిటిసి బొల్లపల్లి తిరుపతి గౌడ్, జంగిలి కుమార్ యాదవ్, ముత్యం తిరుపతి గౌడ్, గడ్డం బాపు గౌడ్ , అనవేన సది, నీర్ల లింగయ్య, బండి రాజేశం, గుల్గం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.