జేఈఈ అడ్వాన్స్ లో మెరిసిన రేమద్దుల విద్యార్థి

పానుగల్ సెప్టెంబర్ 11( జనం సాక్షి )
 జేఈఈ అడ్వాన్స్ లో రేమద్దుల గ్రామానికి చెందిన విద్యార్థి ఆవుల చరణ్ ఆల్ ఇండియా ఓపెన్ క్యాటగిరీలో 2,268 ర్యాంకు సాధించినట్లు అదేవిధంగా రిజర్వేషన్ కేటగిరీలో 359 ర్యాంకు సాధించినట్లు వారి తల్లిదండ్రులు తెలిపారు. నిరుపేద కుటుంబానికి చెందిన శ్రీవాణి, బాలయ్య లకు జన్మించిన చరణ్ చిన్నప్పటి నుంచి చదువులో ముందంజలో ఉంటూ, నిన్న విడుదలైన జేఈఈ పరీక్షలో ర్యాంక్ సాధించడం పట్ల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు విద్యార్థిని అభినందించారు.
Attachments area